కేటిఆర్, లోకేష్ ట్విట్టర్ ఫైట్!!
తెలంగాణ ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటిఆర్, టీడీపి యువ నేత నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటివరకు రోడ్స్ షోస్ లో విమర్శలు చేసుకున్న ఇరు నేతలు..ట్విట్టర్ లో ఫైట్ మొదలుపెట్టారు. నారా లోకేష్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ మంత్రి కేటిఅర్ ట్వీట్ చేసారు. లోకేష్ కూడా కేటిఆర్ పై సెటైర్లు వేయడానికి ప్రయత్నించారు. తనను ఓ మహిళ కేటిఆర్ గా భావించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అడిగిందని లోకేష్ ట్వీట్ చేసారు. దీనికి కేటిఆర్ కౌంటర్ ఇస్తూ..’బ్రదర్..దీన్ని బట్టైనా టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ ఇళ్ళను ఇస్తుందని..ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలుసుకోండి’ అన్నారు.
అటు కవిత కూడా లోకేష్ పై సటైర్లు వేస్తూనే ఉన్నారు. లోకేష్ కు లోకం పోకడ తెలియదంటూ కవిత వ్యాఖ్యానించారు. టీడీపి యువనేత కూడా టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కారు డబ్బున్నోడిది..సైకిల్ పెదలది అంటూ టీఆర్ఎస్ పార్టీ గుర్తుపై కామెంట్ చేసారు. ఇప్పటివరకు ఇరు పార్టీల యువనేతలు కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఇక పార్టీ అధినేతలు నేటి నుంచి రంగంలోకి దిగుతున్నారు. కేసిఆర్, చంద్రబాబు కూడా కౌంటర్లు ఇచ్చుకుంటారా..లేదా మళ్ళీ ‘అపురూప కలయిక’ను గుర్తుచేసుకొని తమపని చూసుకుంటారా!అని నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
No comments:
Post a Comment